అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి.. చిక్కుల్లో కవిత!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడంతో, అతడి వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కవితకు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సీబీఐ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి, సీబీఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్రారెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఆయన ఈడీ కేసులో అప్రూవర్గా మారి, కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సంబంధించి కీలక వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇక తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులో కూడా ఆయన అప్రూవర్గా మారారు. ఈ క్రమంలోనే రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి కావేరి బవేజా రికార్డు చేశారు.
ఈ నేపథ్యంలోనే.. ‘‘శరత్ చంద్రా రెడ్డి దక్కించుకున్న 5 జోన్లకు ఒక్కొక్క జోన్కి రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రూ.25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరింపులకు కూడా పాల్పడ్డారు’’ అని కవితపై సీబీఐ కీలక ఆరోపణలు చేసింది.