రాయ్ బరేలి బరిలో ప్రియాంకగాంధీ ?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కాంగ్రెస్కు పట్టుకున్న రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్బరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక బరిలోకి దిగనున్నట్టు సమచారం. అలాగే రాహుల్ గాంధీ అమేథీ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. అమేథీలో 2004 నుంచి వరుసగా మూడుసార్లు రాహుల్గాంధీ ఎన్నికయ్యారు. ఈ రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి ఏప్రిల్ 26 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అమేథీలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ ఖాయమైతే వచ్చే వారం నామినేషన్లు దాఖలు చేస్తారు.
Tags :