పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని నాగ రామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం అందుకున్నారు. చెన్నైలోని జపాన్ కాన్సుట్ జనరల్ తకహషి మునియో, ఆయన సతీమణి తకహషి మిత్సుయోలు రామభద్ర, ఆయన సతీమణి నాగనాథలకు ఈ పురస్కారం అందజేశారు. భారతదేశంలో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి చేసిన కృషికి గుర్తింపుగా జపాన్ ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ దిశగా దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఆయనకు పురస్కారాన్ని అందజేసినట్లు జపాన్ కాన్సులేట్ జనరల్ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
Tags :