విజయవాడ రోడ్ షోకు .. ప్రవాస భారతీయులు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే రథం ఎక్కి అభివాదం చేశారు. రోడ్షోకు అమెరికా నుంచి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు. కూటమికి మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్ఆర్ఐస్ ఫర్ మోదీ.. సీబీఎన్.. పవన్, ఉయ్ వాట్ డబుల్ ఇంజిన్ సర్కార్ మేము అమెరికా నుంచి వచ్చాం. మాకు ఎన్డీయే ప్రభుత్వం కావాలి అన్న నినాదాలు రాసిన ప్లకార్డులను చూపించారు. కాలిఫోర్నియా నుంచి కోమటి జయరామ్, వర్జీనియా నుంచి సాయి బొల్లినేని, డాలస్ నుంచి చందు కాజ, న్యూజెర్సీ నుంచి వాసిరెడ్డి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
Tags :