ASBL NSL Infratech

దలైలామాకు పీవీ స్మారక పురస్కారం

దలైలామాకు పీవీ స్మారక పురస్కారం

ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌, పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మణీందర్‌జిత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనమడు పీవీఆర్‌ కశ్యప్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలాలత మల్లవరపు, ఫౌండేషన్‌  ప్రధాన కార్యదర్శి ఎం. అనిల్‌ కుమార్‌లు పాల్గొని దలైలామాకు పురస్కారాన్ని అందించారు. మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం పట్ల దలైలామా హర్షం వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :