ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు : ఎంపీ అర్వింద్
వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నిజామాబాద్లో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారతాయని చెప్పారు. రాష్ట్రంలోని అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.
Tags :