ASBL NSL Infratech

అమెరికా నివేదికను తోసిపుచ్చిన భారత్

అమెరికా నివేదికను తోసిపుచ్చిన భారత్

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఇటీవల అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ ఆ నివేదిక పూర్తి పక్షపాతంతో కూడుకున్నది. భారత్‌ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీంతో అర్థమవుతోంది. దీనికి మేం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. మీరు కూడా ఇవ్వొద్దు అని వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :