ఏపీ ఎలక్షన్స్ లో వాళ్లే కీలకం.. కేటీఆర్
ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై కేటీఆర్ తెలివిగా సమాధానమిచ్చారు. ఒకపక్క ఎవరికి వారు సర్వేలు చేసుకుంటూ.. తమదే గెలుపు అని చెబుతూ ఉన్నారు. కేటీఆర్ మాత్రం ఓటర్ల మనసులో ఏముందో ఈరోజుకి కూడా ఎవరికీ తెలీదు.. అదే అసలైన సర్వే అని అన్నారు. అంతేకాదు మీటింగులు పెట్టినప్పుడు ఆంధ్రాలో జగన్ కి జనాలు వస్తున్నారు.. చంద్రబాబుకి జనాలు వస్తున్నారు.. మరి జనం ఎవరి పక్క ఉన్నారు.. ఈ విషయం జనం కి మాత్రమే తెలుసు అంటున్నారు కేటీఆర్. పరిస్థితులు అన్నిటిని బట్టి ఆలోచిస్తే.. ఎవరి జనాలు వాళ్లకు ఉన్నారు.. ఎవరి ఓట్లు వాళ్ళకి ఉన్నాయి. కానీ న్యూట్రల్ గా ఉన్నారు చూడండి వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వీళ్లు పెదవి విప్పరు.. ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పరు. కానీ ఎలక్షన్ రోజు ఓటు వేసి అవతలి వాళ్లను ముంచుతారు. సర్వేలు, పార్టీలు, పథకాలు.. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆ రోజు వాళ్ళ మూడ్ ఎలా ఉంటే అలా వెళ్లి ఓటు వేస్తారు అని అన్నారు. ఓ టీవీ షోలో 'క్రాస్ ఫైర్'లో హోస్ట్గా వెళ్లిన కేటీఆర్ ను ఏపీ రాజకీయాలలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించారు. అయితే అందరూ అనుకున్నట్టు కేటీఆర్ ఈ ప్రశ్నకు తడబడలేదు.. అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఏపీలో అందరూ నాకు కావలసిన వాళ్లు.. జగన్ అన్నయ్య లాంటివాడు.. పవన్ కూడా అన్నతో సమానం.. ఇక లోకేష్ నాకు మిత్రుడు.. అందరికంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గౌరవం.. ఎవరు గెలిచినా ఏముంది గెలవడం ముఖ్యం. వీళ్ళలో ఎవరు గెలిచిన ఆంధ్ర ప్రజలకు మేలు జరగాలి అనేదే నా అభిమతం అని చాలా డిప్లమాటిక్ జవాబు చెప్పి తప్పించుకున్నాడు కేటీఆర్. కేటీఆర్ చెప్పిన ఈ అనాలసిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.