సీతారాముల కల్యాణోత్సవం లైవ్ కి అనుమతివ్వండి : మంత్రి కొండా సురేఖ
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మూడోసారి లేఖ రాశారు. సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని చెబుతూ, ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. ఈ నెల 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.
Tags :