ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు: కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ శకం ముగిసిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా దగా చేసిందని మండిపడ్డారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ‘సంకల్ప సభ’లో మాట్లాడిన ఆయన.. సికింద్రాబాద్‌లో మరోసారి గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతి చేసిన బీఆర్ఎస్‌కు, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు తేడా లేదని, ఓట్లు అడిగే నైతిక అర్హత ఆ రెండు పార్టీలకూ లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు గొప్పలు చెప్పుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు 100 రోజుల్లోనే అర్థమైపోయింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలూ బీజేపీ కైవసం చేసుకోబోతోంది’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :