కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్వేయంగా భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Tags :