మరోసారి ఇలా చేయొద్దని కవితకు కోర్టు వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్ట్ ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినంత మాత్రాన సమాధానం ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించింది. అంతేకాదు మరొకసారి ఇలా చేయవద్దు అంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా కవితను హెచ్చరించారు. అనంతరం కవిత కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కవితను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన కవిత మళ్లీ తిరిగి మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు బయట బీజేపీ ఏదైతే అడిగిందో లోపల రెండు నెలల నుంచి సిబిఐ అదే అడుగుతోంది అని కవిత అన్నారు. మభ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ని సైతం కోర్టు తోసి పుచ్చింది. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటీషన్ను ఈ నెల 16న విచారించనున్నారు.