జైన ముని లోకేశ్ కు యూఎస్ పురస్కారం
భారత్కు చెందిన ప్రముఖ జైన ఆధ్యాత్మిక వేత్త ఆచార్య లోకేశ్ ముని ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్షుడి గోల్డెన్ వాలంటీర్ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. మానవతత్వం, ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్న కృషి గాను ఆయనకు ఈ అవార్డును అమెరికార్ప్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రజా సేవ చేస్తున్నందుకు, భారత్ వంటి గొప్ప దేశానికి, మానవాళికి సేవలు అందజేస్తున్నందుకు మీకు అభినందనలు అని జో బైడెన్ అన్నారు. ఈ అవార్డు నాకు దక్కడం గర్వకారణం. ఈ పురస్కారంతో బాధ్యత మరింత పెరిగిందని అని లోకేశ్ ముని పేర్కొన్నారు.
Tags :