ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అఫ్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దస్తగిరి తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
Tags :