చెప్పుకోవడానికి ఆ పార్టీకి పథకాలే లేవు : హరీశ్ రావు
ప్రజలకు బీజేపీ ఏం చేసిందో ప్రశ్నించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యాయరు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచింది. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేసింది. చెప్పుకోవడానికి ఆ పార్టీకి పథకాలే లేవు అని అన్నారు.
Tags :