ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రూ.200 కోట్ల సంపద దానం చేసి.. సన్యాసం తీసుకోనున్న గుజరాత్ దంపతులు

రూ.200 కోట్ల సంపద దానం చేసి.. సన్యాసం తీసుకోనున్న గుజరాత్ దంపతులు

గుజరాత్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, దాదాపు రూ.200 కోట్ల తమ సంపదను దానం చేశారు. హిమ్మత్‌నగర్‌ చెందిన వ్యాపారవేత్త భవేశ్‌ భండారి దంపతులకు ఓ కూతురు (19), ఓ కుమారుడు (16) ఉండగా, 2022లోనే వారు జైన సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన తల్లిదండ్రులు కూడా అదే మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ సంపద మొత్తం దానం చేశారు. ఈ నెల 22న జైన  సన్యాసం స్వీకరించనున్నారు. అప్పటి నుంచి వారు రెండు తెల్లటి వస్త్రాలు, ఓ రజోహరన్‌ (చీపురులాంటిది), భిక్షం ఎత్తుకునేందుకు ఓ పాత్రను మాత్రమే కలిగి ఉంటారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దేశ పర్యటన చేస్తూ, భిక్షను స్వీకరిస్తూ జీవిస్తారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :