గుడివాడలో కొడాలి నానికి షాక్
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత షేక్ మౌలాలి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులకు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకు మౌలాలి లాంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తున్నారన్నారు. నాని పచ్చి మోసగాడని, అవసరం తీరాక వదిలేస్తాడని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొడాలి నాని ఆడుతున్న డ్రామాలు ఎక్కువ రోజులు సాగవు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ మొదటి స్థానంలో, నాని రెండో స్థానంలో ఉన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా అరాచకానికే వైసీపీ ప్రాధాన్యమిస్తోంది. రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం, మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తోంది. గుడివాడ అభివృద్ధి చెంది భావితరాలు బాగుండాలంటే ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరారు.