ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సింగర్ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..

సింగర్ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరొకసారి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తన అభిమానుల కోసం శ్రీరామనవమిని పురస్కరించుకొని తొలిసారిగా తెలుగులో స్వయంగా ఒక పాటను రాయడమే కాకుండా పాడారు కూడా. ఇక శనివారం ఈ పాటకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. హిందువుగా పుట్టాలి.. హిందువుగా బతకాలి అంటూ సాగే ఈ పాటను రాజాసింగ్ తనదైన శైలిలో పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. పూర్తి పాట ఏప్రిల్ 17 శ్రీరామనవమి నాడు దూల్పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం వద్ద విడుదల చేస్తారు. 13 సంవత్సరాల క్రితం దూల్పేటలో రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాట విడుదల అనంతరం గుడి వద్ద నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర కూడా ప్రారంభం అవుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :