భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర
బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్డి హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం కోసం దీనిని తయారు చేశారు. ఈసారి చీరపై సీతారాముల కల్యాణ వేడుక ప్రతిరూపాలను, శంకుచక్రనామాలు, చీర అంచు లో జై శ్రీరామ నామాలను పొందుపరిచారు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 800 గ్రాముల బరువున్న చీరలో 2 గ్రామలు బంగారం 150 గ్రాముల వెండిని ఉపయోగించారు.
Tags :