వీఐపీల పర్యటనలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి : సీఈవో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయితో దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. విజయవాడ సీపీ కాంతిరాణా, ఐజీ రవిప్రకాశ్ను పిలిపించి ఘటనపై సమీక్షించారు. జగన్ చేపట్టిన బస్సు యాత్రలో బందోబస్తు ఉన్నప్పటికీ ఎలా దాడి చేయగలిగారని సీఈవో ప్రశ్నించారు. ఈ ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు వేగవంతం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఈవో ఆదేశించారు. వీఐపీల పర్యటనలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.
Tags :