భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది. గరుడపటాన్ని పూజించి తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించింది. గరుడమూర్తికి ప్రసాదాన్ని ఆరగింపు చేసి భక్తులకు అందించారు. నేడు ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.
Tags :