వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికి తోడు మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు ప్రకటించారు. అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో పార్టీలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Tags :