బాబు మినీ మేనిఫెస్టో ను నమ్మొచ్చా..?
ఆంధ్రాలో అభివృద్ధి తీసుకురావడానికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాబు ఆంధ్రలో వరాల జల్లు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు పేరుతో కనీ విని ఎరుగని రీతిలో ప్రజల కోసం ఉచితాలను అందజేస్తున్నారు. అయితే మోడీ సర్కార్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అభివృద్ధి గురించి ఉంది తప్ప ఉచితాల గురించి ఎక్కడా ప్రసక్తి లేదు. అయోధ్య రామాలయం నిర్మించిన నేపథ్యంలో ఈసారి కూడా గెలుపు తమదే అన్న ధీమాతో మోడీ సర్కార్ ముందుకు సాగుతుంది. ఇండియాను 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే విధంగా బీజేపీ ఆలోచిస్తుంది. పైగా ఉచితాలు మోడీ సర్కార్ దృష్టిలో అభివృద్ధికి ఆటంకాలు. అందుకే గతంలో చాలా రాష్ట్రాలను ఈ ఉచితాల విషయంలో ఆయన హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అవి రాష్ట్ర ఖజానాని ఆర్థికంగా కుంగ దీస్తాయి అనేది మోడీ వాదన. ఇటు ఆంధ్రాలో ఉమ్మడిగా జతకట్టిన పార్టీలు మూడు ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పటివరకు ఇవ్వలేదు. కేవలం బాబు మినీ మేనిఫెస్టో మీద ప్రజలు నమ్మకం పెట్టుకుంటే పరిస్థితి గల్లంతయ్యే ఆస్కారం కనిపిస్తోంది.