దుబాయ్ లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనం
గల్ఫ్ కార్మికుల సమస్య లపై కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసిందని, వాటి పరిష్కారానికి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దుబాయ్లో జరిగిన తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్ కార్మికుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గల్ఫ్ లో నివసిస్తున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వారితో నిర్వహంచిన సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం సలహాలు తీసుకున్నారు. గల్ప్లో నివసిస్తున్న వారు సమయం తీసుకొని జీవన్ రెడ్డి గెలుపుకోసం నిజామాబాద్ ఓటర్లకు అవగాహన కల్పించి తమవంతు కృషి చేయాలని కోరారు.
Tags :