బీఆర్ఎస్ కీలక సమావేశం.. ముఖ్య నేతలందరికీ ఆహ్వానం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన బి ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చు కింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్శ సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.