బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి చేరిన ముఖ్యమైన ఎమ్మెల్యే
తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్కు కు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా బీఆర్ఎస్కు మరొక పెద్ద షాక్ తగిలింది. పార్టీలో కీలకమైన నేత మద్దగోని రామ్మోహన్ గౌడ్ సతీసమేతంగా శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2014, 2018 ఎన్నికలలో రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయారు. అయితే ఈ రెండు సార్లు ఆయన ఓటమి చాలా స్వల్పమైన తేడాతో జరిగింది. దీంతో 2023 ఎన్నికలలో కెసిఆర్ 2018లో రామ్మోహన్ గౌడ్ ని ఓడించిన సుధీర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ పార్టీ మారారు అని టాక్.
Tags :