రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎర్రవెళ్లి వ్యసాయ క్షేత్రంలో తాటికొండ రాజయ్య పార్టీ కీలక నేతలతో కలిసి కేసీఆర్తో సమావేశం అయ్యారు. రాజయ్యకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు కేసీఆర్ అప్పగించారు. నియోజకవర్గ బాధ్యతలు మొత్తం పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలిపించుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ రాజయ్యకు చెప్పారు.
Tags :