సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
Tags :