సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కారణంతో ఆమె స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. లాస్య నందిత స్థానంలో ఆమె సోదరి నివేదితను బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం డిక్లేర్ చేసింది. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ స్థానం తమ చేతిలో నుంచి పోకూడదు అని బీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ప్రయత్నిస్తోంది.
Tags :