ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కారణంతో ఆమె స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. లాస్య నందిత స్థానంలో ఆమె సోదరి నివేదితను బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం డిక్లేర్ చేసింది. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ స్థానం తమ చేతిలో నుంచి పోకూడదు అని బీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ప్రయత్నిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :