ఎన్నికల ముంగిట ఏపీలో మరొక ఉన్నతాధికారి బదిలీ..
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కొందరు ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇప్పుడు తాజాగా మరొక ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న డి.వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అంతేకాదు ఆయన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులు అప్పగించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఇక ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నూతన ఎండి గా ముగ్గురి పేర్లు సిఫార్సు చేయాలని రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని కూడా ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.
Tags :