జగన్ ను జనాలకు దూరం చేయడానికి దాడి చేశారు.. అమర్నాథ్
జనంలో జగన్ కి వస్తున్న పాపులారిటీ చూసి ఓర్చుకోలేని వాళ్ళు అతనిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన ఏం తప్పు చేశారని ఆయనపై రాళ్లు విసురుతున్నారు అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్ భయపడి ఇంట్లో కూర్చుంటారని అందరూ భావించారని.. జగన్ ను ప్రజలకు, ప్రచారానికి దూరం చేయడం కోసమే వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. అలా అనుకోవడం వాళ్ళ పొరపాటని ఏం చేసినా జగన్ ని ప్రజల నుంచి దూరం చేయలేరని అమర్నాథ్ అన్నారు. అంతేకాదు సానుభూతి కోసం తమపై తాము దాడులు చేయించుకునేటంత కర్మ తమకు పట్టలేదని స్పష్టం చేశారు. గాజువాక సభలో చంద్రబాబు జగన్ పై చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమికి తమ గెలుపు పై కలిగిన భయం వాళ్ళ చేత అలా మాట్లాడిస్తుందని అమర్నాథ్ అన్నారు.
Tags :