లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా.. న్యూస్ ఎక్స్ సర్వే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఈ పార్టీ మూలాలు కూడా ప్రజలు మర్చిపోతున్నారు అనుకునే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ విక్టరీ ఆ పార్టీకి ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఇక ఆ విషయం పక్కన పెడితే జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటుంది అని న్యూస్ ఎక్స్ సర్వే తెలిపింది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏడు స్థానాలలో విజయకేతనం ఎగురవేయబోతున్నట్టు ఈ సర్వే పేర్కొంది. మరోపక్క తెలంగాణలో కూడా బలపడాలి అని ప్రయత్నిస్తున్న బీజేపీ ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్పింది ఈ సర్వే. కనీ విని ఎరుగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు స్థానాలకి పరిమితమైంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎంఐఎం పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కు.. లోక్ సభ ఎన్నికలు కూడా అచ్చొచ్ఛేలా కనిపించడం లేదు.