విశాఖలో కలకలం.. 7 ప్రశ్నలతో
విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్ కాంప్ల్క్స్ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్నకు కారణమైందెవరు? ఐపీఎస్ అధికారుల స్థలాలనూ కబ్జా చేసిందెవరు? వృద్దుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆక్రమ స్థలాలను కాజేసిందెరు? అంటూ ప్రశ్నలు సంధించారు. తూర్పు నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిని ఉద్దేశించే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags :