ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీలో సంచలనం... వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

ఏపీలో సంచలనం... వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడిరచారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిరది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చినకోర్టు,  వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీరుపై దళిత,  ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :