వాషింగ్టన్ లో దుండగుల కాల్పులు
అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఆ దేశ రాజధాని వాషింగ్టన్లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 9, 12 ఏళ్ల పిల్లలతో పాటు ఓ మహిళా కూడా ఉన్నారు. కార్వర్ లాంగ్స్టన్ ప్రాంతానికి వాహనంలో వచ్చిన అనుమానితులు వీధిలోని ప్రజలపై ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
Tags :