దుమ్ముంటే నాతో ఒకరోజు.. పాదయాత్ర చేయి
తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో కలిసి ఒకరోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొనాలని, సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతా ? అని మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. సమస్యలు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. డిగ్రీ, పీజజీలు చేసిన వాళ్లు రాష్ట్రంలో తలెత్తుకుని తిరుగలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :