సురేందర్ రెడ్డికి అసలేమైంది?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సురేందర్ రెడ్డి, చివరగా సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఉన్నంతలో బానే ఆడింది. బడ్జెట్ భారీగా పెట్టడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది తప్పించి, డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి సైరాతో మంచి మార్కులే పడ్డాయి. కానీ తన తర్వాతి సినిమా చేయడానికి చాలానే టైమ్ పట్టింది.
ఆఖరికి అఖిల్తో ఏజెంట్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ సినిమా అనేక రకాల కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. గతేడాది మధ్యలో రిలీజ్ కావాల్సిన ఏజెంట్, ఎట్టకేలకు ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ డేట్ అందుకోవడానికి ఏజెంట్ టీమ్ మొత్తం చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా ఇంత లేట్ అవడానికి కారణమేంటని రీసెంట్గా జరిగిన ఏజెంట్ ప్రెస్ మీట్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సురేందర్ ఆన్సర్ ఇచ్చాడు.
మా ఏజెంట్ మూవీకి వర్కింగ్ డేస్ 100 రోజులు మాత్రమే అని సురేందర్ రెడ్డి దిమ్మతిరిగే ఆన్సరిచ్చాడు. కరోనా వల్ల సినిమా దాదాపు ఏడాది ఆగిపోయింది. తర్వాత తాను ఆరు నెలల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, అందుకే సినిమా లేట్ అయిందని సురేందర్ తెలిపాడు. దీంతో అసలు ఆరు నెలలు ఆస్పత్రిలో ఉండేంత సురేందర్ రెడ్డికి ఏం బాలేదు అనే చర్చ మొదలైంది.
కరోనా వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పినప్పటికీ, కరోనాకు అంత కాలం ఆస్పత్రిలో ఉండటమేంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకేదైనా ఆరోగ్య సమస్య వల్ల సురేందర్ రెడ్డి అన్ని రోజులు హాస్పిటలైజ్డ్ అయ్యారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏజెంట్ సినిమాపై సురేందర్ రెడ్డి ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నాడు.