ASBL NSL Infratech

బాబు చరిత్రహీనుడిగా నిష్క్రమిస్తాడు.. విజయ్ సాయి రెడ్డి..

బాబు చరిత్రహీనుడిగా నిష్క్రమిస్తాడు.. విజయ్ సాయి రెడ్డి..

ఆంధ్రాలో ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదు అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో 42 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు హయాంలో అక్కడ తుడిచిపెట్టుకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీ లో కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని.. ఇక్కడ కూడా చంద్రబాబు పార్టీ జెండా పీకేయాల్సిందే అని ఆయన అన్నారు. 16 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ చంద్రబాబు స్వార్థం వల్ల అంతరించుకుపోతోందని బాధను వ్యక్తం చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత చంద్రబాబు అనబడే వ్యక్తి కారణంగా టీడీపీ పార్టీ లేకుండా పోతుంది అని విజయ్ సాయి రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. విజనరీ లీడర్.. అపర రాజకీయ చాణిక్యుడు.. అని ఎల్లో మీడియా ఎంతగా ఎలివేషన్స్ ఇచ్చినా.. అతని బుద్ధి కారణంగా చంద్రబాబు చరిత్రహీనుడిగానే రాజకీయం నుంచి నిష్క్రమిస్తాడని.. విజయ్ సాయి రెడ్డి అన్నారు. ఈసారి కూడా జగన్ గెలుస్తాడని.. ప్రజల మనసులో జగన్ మీద ఉన్న అభిమానాన్ని ఎన్ని అబద్ధాలు చెప్పినా నాశనం చేయలేరని ఆయన పేర్కొన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :