ఆస్ట్రేలియా సెనేట్ సభ్యుడిగా వరుణ్ ఘోష్
ఆస్ట్రేలియా సెనేటర్లో మొట్టమొదటి సారిగా భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్(38) స్థానం సంపాదించారు. లేబర్ పార్టీ తరపున ఆయన వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుత సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ అనారోగ్య కారణాలతో రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో ఫెడరల్ పార్లమెంట్కు వరుణ్ను ఎన్నుకున్నట్లు వెస్టర్న్ ఆస్ట్రేలియా లెజిస్టేటివ్ అసెంబ్లీ ప్రకటించింది. 1985లో భారత్లో జన్మించిన వరుణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు ఆస్ట్రేలియాకు వచ్చారు.
Tags :