తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్థరాత్రి 12:05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల కు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.
Tags :