తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను తెలంగాణ గవర్నర్ తమిళి సై మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు అనేక అంశాలపై చర్చించుకున్నారు. బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు భువనేశ్వర్లో టీటీడీ కొత్తగా నిర్మించిన శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ కాక్యక్రమానికి హాజరై, తిరిగి విజయవాడ వెళ్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు అగారు. ఈ సందర్భంగా తమిళిసై కలిసి మాట్లాడారు. గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించారు. తెలంగాణ గవర్నర్ ప్రత్యేకంగా విమానాశ్రయానికి వచ్చి తనను మర్యాద పూర్వకంగా కలవటం పట్ల గవర్నర్ హరిచందన్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags :