భారీ ష్యూరిటీ నుంచి డొనాల్డ్ ట్రంప్ కు వెసులుబాటు
ఆదాయం, ఆస్తుల విలువను ఎక్కువ చూపి బ్యాంకులు, బీమా సంస్థలకు మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊరట లభించింది. సుమారు రూ.3 వేల కోట్ల భారీ మొత్తానికి బదులుగా పది రోజుల్లో రూ.1,460 కోట్ల ష్యూరిటీ బాండ్ ఇస్తే సరిపోతుందని న్యూయార్క్లోని అప్పీల్స్ కోర్టు తెలిపింది. ట్రంప్ ఈ మొత్తం చెల్లిస్తే ఆస్తుల్ని సీజ్ చేసే ప్రక్రియ నిలిచిపోతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆస్తుల సీజ్కు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ తీర్పు రావడం గమనార్హం. రూ.3 వేల కోట్ల ష్యూరిటీ బాండ్ను తీసుకురావడం అసాధ్యమంటూ ట్రంప్ లాయర్లు గత వారం అప్పీల్స్ కోర్టుకు విన్నవించుకున్నారు.
Tags :