తెలంగాణ భవన్ లో మిన్నంటిన సంబురాలు
మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ పటాకులు కాల్చుతూ గులాబీ రంగు బెలూన్లు ఎగరవేస్తూ ఆనందోత్సవాల్లో మునిగితేలారు. స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేటీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసరాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి.
మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ భవన్కు వచ్చిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్కు కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. పూలబొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు చేరుకుని మంత్రి కేటీఆర్తో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
Tags :