ASBL NSL Infratech

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సుప్రీంలో విచారణ.. కోర్టు అసహనం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సుప్రీంలో విచారణ.. కోర్టు అసహనం

మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో మధ్యర్తులుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్ శర్మ, నందకుమార్‌, సింహయాజులుపై హైకోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు సంబంధించిన బెయిల్ కేసులు ప్రస్తుతం దిగువ న్యాయస్థానంలో ఉన్నాయని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :