సౌదీలో భారత కాన్సుల్ జనరల్ గా ఫహాద్ అహ్మద్
సౌదీ అరేబియాలోని జెద్దాలో భారత కాన్సుల్ జనరల్గా కర్నూలుకు చెందిన ఫహాద్ అహ్మద్ సూరి నియమితులయ్యారు. 2014 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ఫహాద్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో విధులు నిర్వర్తిస్తూ మధ్య ప్రాచ్యంలోని దేశాలతో భారత ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. అంతకుముందు ఆయన కువైట్లోని భారత ఎంబసీలో పనిచేశారు. కరోనా సంక్షోభం సమయంలో చేపట్టిన మిషన్ వందే భారత్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. కర్నూలులోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన ఫహాద్ స్థానిక జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు. ఆ తర్వాత బెంగళూరులో ఎంబీఏ చేసి లండన్లో బ్యాంకర్గా పని చేసిన అనంతరం సివిల్స్ ద్వారా ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు.
Tags :