స్టార్ క్యాంపెయినర్ గా తమిళిసై!
తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తమిళి సై పేరు కూడా ఉంది. తమిళిసైతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, అన్నామలూ, కుష్బూ, సుందర్, రాధిక శరత్ కుమార్, తేజస్వి సూర్య రాజాసింగ్, యోగి, ఆదిత్యనాథ్, నిర్మలా సీతారామన్ పేర్లను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్లుగా రానున్నారు. ఇలా 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ అందించింది.
Tags :