ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో తొలుత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గత మంగళవారం స్టాలిన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని మరోసారి ప్రజలకు అభ్యర్థించారు.
Tags :