ASBL NSL Infratech

అమెరికా నుంచి భారత్ కు వచ్చే నౌకతోపాటు.. మరో దానిపై

అమెరికా నుంచి భారత్ కు వచ్చే నౌకతోపాటు.. మరో దానిపై

అమెరికా నుంచి భారత్‌కు వచ్చే నౌకతోపాటు మరో దానిపై పశ్చిమాసియా జలాల్లో హూతీ రెబల్స్‌ డ్రోన్లతో దాడి చేశారు. తొలి దాడి ఎర్ర సముద్రంలోని దక్షిణ ప్రాంతంలో యెమెన్‌ తీర ప్రాంత పట్టణమైన హోడైడా వద్ద జరిగింది. ఈ ఘటనలో నౌక అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బార్బడోస్‌ జెండాతో వస్తున్న బ్రిటన్‌ కంపెనీకి చెందిన నౌకపై ఈ  దాడి జరిగినట్లు సైన్యం వెల్లడించింది. ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. యెమెన్‌ దక్షిణ తీర ప్రాంత పట్టణం ఎడెన్‌వద్ద రెండో నౌకపై దాడి జరిగింది. ఇది మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న గ్రీస్‌ కంపెనీకి  చెందిన నౌక. స్టార్‌బోర్డుకు 50 మీటర్ల దూరంలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రైవేటు భద్రతా సంస్థ యాంబ్రే వెల్లడిరచింది. నౌకకూ నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన రెండు నౌకలపై తాము దాడి చేసినట్లు హూతీ ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :