వీహబ్ ను సందర్శించిన షార్జా ప్రతినిధుల బృందం
తెలంగాణ ప్రభుత్వ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీహబ్)తో పని చేయడానికి షార్జా పరిశోధన, సాంకేతిక, ఆవిష్కరణల పార్కు ముందుకొచ్చింది. ఆ పార్కు ప్రతినిధి బృందం వీహబ్ను సందర్శించింది. ఈ సందర్భంగా వీహబ్ సీఈవో రావుల దీప్తి రాష్ట్రంలో మహిళా పారిశ్రామికాభివృద్ధి, ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థపై వివరించారు. తెలంగాణ యూఏఈల మధ్య పరస్పర సహకారం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, అంకురాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. టీహబ్కు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను వారు అభినందించారు.
Tags :