క్రికెట్ దిగ్గజం సచిన్ కు కరోనా
క్రికెట్ దిగ్గజం, మ్లాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా సోకింది. తాజాగా సచిన్ కరోనా పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ పరీక్షల్లోనే కరోనా అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, శ్రేయోభిలాషులకు సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ వేదికగా సచిన్ కోరారు.
Tags :